జనాల్లో ఇమేజ్ పాజిటివ్ గా స్థిరపడింది.
కొత్త తరహా రాజకీయం ఆంధ్రావనిలో కనపడుతోంది. స్థాయి మరిచి ఒకరినొకరు దూషించుకోవడంతో ఒకరి స్థాయిని ఒకరు కించపరుస్తుంటే, ఒకరు ఇంకొకరి స్థాయిని ఇదే సమయంలో పెంచుతున్నారు. ఇదే కోవలో చంద్రబాబు, జగన్ వచ్చి చేరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ ఒకదానినొకటి తిట్టుకోవడంతో కొత్త వివాదం ఒకటి రాజుకుంది. ఒక సీఎం స్థాయి వ్యక్తిని అలా తిట్టడం తప్పే అని కొందరు, ఇదివరకు నాని మాట్లాడిన బూతుల కథేంటి అని ఇంకొకరు వాల్ పోస్టర్లు రిలీజు చేస్తున్నారు. మొత్తానికి బంద్ ను అణిచి అడుగడుగునా పోలీసు సిబ్బందితో అడ్డుకుని సీఎం జగన్ తొలి సారి అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ శాతమే విజయవంతం అయి, చంద్రబాబు స్థాయిని ఒక్కసారిగా పెంచేశారు.
ఏపీ లో పరిణామాలు క్షణానికో రీతిన మారిపోతున్నాయి. తెలంగాణలో కన్నా ఇక్కడే రాజకీయ వేడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు అన్నదే తేలకున్నా, తెలియకున్నా చంద్రబాబు వర్గం, వైసీపీ వర్గం రెండూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ పందెంలో గెలుపు ఎవరిది అన్నది తేలకున్నా ప్రస్తుతానికి ఈ గొడవ ఇప్పట్లో తేలదు. అలానే రౌడీ రాజకీయాలు ఇప్పట్లో ఆగవు. బూతులు తిట్టుకోవడం, భౌతిక దాడులకు పాల్పడడం అన్నవి ఇప్పుడిక కామన్. ఇదే దశలో ఎవరిది పై చేయి అయితే వారిదే రాజ్యం. ఇక అడిగే వారు లేరు. అడిగినా సమాధానం చెప్పేవారు ఉండరు. అంతేకాదు సమస్యలపై అడిగి మాట్లాడేవారు నాయకులకు లోకువ అయిపోతారు. ఈ దశలో బలం ఉన్నవాడిదే, ధనం ఉన్నవాడిదే రాజ్యం కాగలదు. ఇప్పటిదాకా ఏ సూత్రాలు ఉన్నా అవన్నీ రివర్స్ కానున్నాయి.