గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. ఇక వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం తిరుపతిలో భూమన స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆయనకు ధీటుగా టీడీపీ నాయకురాలు సుగుణమ్మ కూడా పనిచేస్తున్నారు. మళ్ళీ టీడీపీ నుంచి గెలవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్తితులని చూస్తే ఇక్కడ భూమనకు చెక్ పెట్టడం ఈజీ కాదు. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది.
అయితే ఓ ఈక్వేషన్ ప్రకారం భూమనకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి...అది ఎలా అంటే ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిస్తే ఇక్కడ భూమనకు చెక్ పెట్టడం ఈజీ. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ డైరక్ట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ బరిలో దిగిన భూమనకు ఇబ్బందే. అలా కాకుండా టీడీపీ-జనసేనలు కలిసిన భూమనకు చిక్కులు తప్పవు. లేదంటే తిరుపతిలో భూమనదే పైచేయి.