ఆంధ్ర ప్రదేశ్ జెన్ కో కోర్టు కేసును ఉపసంహరించుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య ఉన్నటువంటి పరస్పర ఒప్పందం ద్వారా వివాదం పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు కేంద్ర సర్కార్ కు తెలియజేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని  2014లో ఉన్నటువంటి ఏ సవరణ నైనా తెలంగాణ సర్కార్ కూడా అంగీకరించింది. ఇది ఏడున్నర ఏళ్ల తర్వాత పనుల విషయాలపైన ఉన్నటువంటి క్రమరాహిత్యాలను తొలగించడం కోసమే అంతులేనటువంటి వ్యాజ్యాల కు దారితీస్తోంది. ఇప్పటికే పరిష్కరించబడినటువంటి విషయాలపై మరింత క్లిష్టతరం చేస్తున్నది.

ఏపీ ఆర్ ఏ ద్వారా ఉత్పన్నమయ్యే ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక  సమస్యలను పరిష్కరించడం కోసం సన్నాహక పనిని నిర్వహించడం కోసం ఆచరణాత్మక మార్గాలను సిఫార్సు చేయడానికి హోంమంత్రిత్వ శాఖలోనీ జాయింట్ సెక్రెటరీ ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో రామకృష్ణ రావు మాట్లాడారు. ఆయన  సమస్యల పైన తెలంగాణ యొక్క అభిప్రాయాలతో ఏకీభవించారు. ఇదేమీ ద్వైపాక్షిక సమస్య కాదని నిర్ణయించి తొలగించడానికి అంగీకారం తెలిపాడు. ఏపీ జెన్ కొకు తెలంగాణ డిస్కంతో విద్యుత్ బకాయిలను చెల్లించడం, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి నటువంటి 5 కీలక అంశాలను సమావేశంలో చర్చించారు.

 ఆంధ్రప్రదేశ్ జెన్ కొకు తెలంగాణ డిస్కం ద్వారా విద్యుత్ బకాయిలను చెల్లించడంపై మాట్లాడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణకు విద్యుత్ వినియోగానికి రావాల్సిన మొత్తం బకాయిలు  12532 కోట్ల రూపాయలు అనే సమావేశంలో తెలిపారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ జెన్ కో స్వతంత్ర సెటిల్మెంట్ గానే చెల్లించాల్సిన 3442 కోట్ల రూపాయల సెటిల్మెంట్ కోసం ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఏది ఏమైనా ప్రతి ఒక్క రాష్ట్రం విద్యుత్ బకాయిల సంబంధించి ఈ విషయంపై మొత్తం చెల్లించాల్సిన బకాయిలను సెటిల్మెంట్ కాకుండా కలిపి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: