ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం రోజురోజుకి తారస్థాయికి వెళ్ళిపోతున్నాయి.. పొత్తు పెట్టుకున్నాం ఇక వ్యూహం నాకు వదిలేయండి అంటూ పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే.. నేను పొత్తు పెట్టుకున్నది కేవలం నా ప్రజలతోనే సింగిల్గానే వస్తానంటూ జగన్ ఒంటరిగా ఎన్నికల సంబరానికి సిద్ధమయ్యారు.. టిడిపి జనసేన బిజెపి కాంగ్రెస్ ఇలా నాలుగు పార్టీలు కలసి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధమవుతున్నారు.. అయితే ఎంతమంది వచ్చినా ఎన్ని పొత్తులు పెట్టుకున్న చిత్తు చేయడానికి తాము సిద్దమే అంటూ పలు రకాల సభులతో సవాలు కూడా విసిరారు సీఎం జగన్..


ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదు మళ్లీ ఆయన సీఎం అవుతారు అంటూ కూడా జోష్యం చెప్పింది సినీనటి బిజెపి నేత మాధవిలత.. పొత్తు పెట్టుకున్నాం గెలిచేస్తామనుకుంటే అసలు అది జరగని పని జనం మద్దతు కూడా జగన్కే ఉందంటూ మాధవి లత వివరిస్తోంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రాలో రాబోతున్న ఎన్నికలలో బిజెపి జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి ఈ పొత్తు పెట్టుకున్నాం కదా అని ఈజీగా గెలిచేద్దాం అనుకుంటే అది సాధ్యం కాదు.



ముఖ్యగా జగన్ ఓడిద్దామంటే అంత ఈజీ పని కాదని.. ఆయన రాజకీయ ప్రణాళిక నెక్స్ట్ లెవెల్ లో ఉందని అంతేకాకుండా జనానికి ఎక్కువగా సంక్షేమ పథకాలను ఇవ్వడం వల్ల మళ్ళీ ఆయన గెలిచే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని.. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉన్నదంటూ వెల్లడించింది.. మిగతావారు ఎక్కువగా ఖర్చు పెట్టలేరా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొనాలి అంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని వెల్లడించింది.. కాబట్టి మళ్లీ కూడా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.. కేవలం ఈ మూడు పార్టీలు కష్టపడి పని చేస్తే తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: