![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/viveka-death-sharmila-sunihta-chandrababu-pawan-court-kadapa0b7361f6-9eeb-45fe-9f64-373be0703faf-415x250.jpg)
ఈ నేపథ్యంలో అటు వై.ఎస్ షర్మిల, సునీతతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ హత్య పైన మాట్లాడుతూ ఉండడంతో ఇటీవల కోర్టులో దాఖలైన పిటీషన్ ను విచారించిన కడప కోర్టు ఈ రోజున పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేసింది.. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎవరూ కూడా వివేక హత్య కేసు పైన మాట్లాడకూడదంటూ అటు వైఎస్ షర్మిల , సునీత రెడ్డి తో పాటు చంద్రబాబు ,లోకేష్ , పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కి సైతం కడప కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
గత కొద్దిరోజులుగా ఎక్కువగా షర్మిల, చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవి, సునీత వంటి వారు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రాకులాడుతూ ఉండడంతో వైసిపి నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు.. దర్యాప్తులో ఉన్న కేసును సైతం ఎన్నికల ప్రలోభాల కోసం వాడుకోవాలని చూస్తూ ఉండడంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపైన స్పందించిన కడప కోర్టు.. ఎవరు కూడా వివేకానంద హత్య కేసు పైన మాట్లాడకూడదు అంటూ అందరికీ ఉత్తర్వులు జారీ చేసింది.