ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నో రకాల సర్వేలు సైతం వెలుపడ్డాయి.ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే చూస్తే.. వైసిపి పార్టీకి 96 స్థానాలు గెలుస్తుందని టైట్ ఫిట్ మధ్య మరో 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. మొత్తం మీద 118 స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. కూటమి 46 స్థానాలు గెలుస్తుందని. 3 చోట్ల టైట్ ఫైట్ తో గెలుస్తుందని మొత్తం మీద 49 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.




మరో 8 స్థానాలు చాలా టైట్ ఫైట్ గా ఉన్నాయి.. దానికి సంబంధించిన లెక్క ప్రజలే తేల్చాలి అన్నట్టుగా తెలియజేశారు. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ పార్టీకి 22 టఫ్ ఫైట్ ఉంది.. టిడిపి బిజెపి జనసేన కి మూడు.. హెవీ టైట్ అన్నవి 8 ఉన్నాయని తేల్చారు. అలాగే పార్లమెంట్(mp )విషయానికి వస్తే కూటమి 4 స్థానాలని వైసీపీ 17 అని... టైట్ ఫిట్ 4 ఉంటాయని తెలియజేశారు. పర్సెంటేజ్ విషయానికి వస్తే వైసిపి పార్టీ 48-50%.. అని కూటమి..45-47% అని ఇతరులు..3-4 పర్సంటేజ్ గెలుచుకోవచ్చని అంచనా తెలియజేశారు నాగన్న సర్వే.



నాగన్న సర్వే కి సంబంధించి ఒక ట్వీట్ కూడ వైరల్ గా మారుతోంది.. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, షర్మిల, బాలయ్య, పురందేశ్వరి వంటి వారికి కూడా ఈసారి గెలవడం కష్టంగానే ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏమి మేరకు ఎవరు అధికారంలోకి చేపడుతారు ప్రజలు ఎవరికి తీర్పు ఇచ్చారనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఇప్పటికి ఎన్నో సర్వేల సైతం అటు కూటమి అధికారంలోకి వస్తుందని వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేయడంతో నేతలలో ఫుల్ ఖుషి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: