వైసీపీ ప్రభుత్వం రైతులను కుంభకోణాలకు ఉపయోగించుకుని, వ్యవస్థను దుర్మార్గంగా మార్చిందని మనోహర్ ఆరోపించారు. జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ పద్ధతులను కొనసాగించాలని కోరడం అసంబద్ధమని విమర్శించారు. బెంగళూరు నుండి పనిచేసే ఎమ్మెల్యే జగన్కు రైతుల సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గత పాలనలో రైతులు వేదనకు గురయ్యారని, వారి హక్కులను కాలరాసినట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని మనోహర్ వెల్లడించారు. 48 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు 11 వేల కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. ఈ చర్యలు రైతులకు ఆర్థిక ఊరటనిచ్చాయని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిబద్ధతను మనోహర్ నొక్కిచెప్పారు. జగన్ పాలనలో రైతులు అనుభవించిన అవమానాలు, ఆర్థిక నష్టాలను పరిహరించే దిశలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి