టిడిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద పండుగగా జరుపుకొనే కార్యక్రమం మహానాడు. నేటి నుంచి కడప జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా మహానాడుని మరి కొన్ని గంటలలో ప్రారంభించబోతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమిలో భాగంగా టిడిపి ఘనవిజయాన్ని అందుకోవడంతో మొదటిసారి మహానాడు సభకు మంచి ప్రాధాన్యత ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కడప జిల్లా మొత్తం కూడా పసుపు జెండాలు పసుపు తోరణాలతోనే చుట్టుముత్తాయి. మహానాడులో పాల్గొనేందుకు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి నేతలతో పాటు అభిమానులు కార్యకర్తలు కూడా వస్తున్నారు.


మహానాడును కడప శివారులోని చెర్లోపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ చివరి రోజు బహిరంగ సభ కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా 140 ఎకరాలలో ఈ సభని ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 500 ఎకరాలను కేటాయించారు. టిడిపి పార్టీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అందుకు అనుగుణంగా ప్రతిపాదన అంశాలను కూడా ఈ మహానాడుగా చేర్చించబోతున్నారట. అలాగే ఏపీ ప్రజలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఈ మహానాడులో చర్చించే విధంగా టిడిపి భావిస్తోంది.


ఇందుకు సంబంధించి షెడ్యూల్ ని కూడా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది..

1). ఉదయం 8: 30 నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు ఉంటుంది..

2). 10 నుంచి 10:45 వరకు ఫోటో ప్రదర్శన రక్త శిబిర కార్యక్రమాలు ఉంటాయి


3).10:45 నుంచి ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందట.

4).11:30 నుంచి 11:45 వరకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగం ఉంటుంది.

5).11:50 నుంచి 12:45 వరకు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడతారు

6).12:45 నుంచి 1:00 టిడిపి పార్టీకి సంబంధించి ఆరు సూత్రాల ఆవిష్కరణ పైన చర్చలు ఉంటాయట.

7). జాతీయ పార్టీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ 1:00 కి.

8).2:00 నుంచి 3:30 మధ్య కార్యకర్తల పైన చర్చలు జరుగుతాయి.

9).3:30 నుంచి 5:00 గంటలకు ఉపాధి, యువత సంక్షేమ, వాట్సాప్ గవర్నర్ పైన చర్చలు జరుగుతాయి అట.

10). సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల వరకు వెనకబడిన ప్రాంతాలు సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు.

మరింత సమాచారం తెలుసుకోండి: