
అయితే ఇప్పుడు అన్ని చూసుకుంటూనే లోకేష్ కి ఇప్పుడు ఎందుకు కొత్త పదవులు కిరీటాలు అన్న చర్చ అయితే అందరిలో రావచ్చు .. కానీ పదవులు అందుకోవటంలోనే ఆనందం ఉంటుంది .. పైగా వాటిని అలంకరణగా చూడకుండా బాధ్యతగా చూసే వారికి దక్కితే ఇంకా అవి పవర్ఫుల్ గా ఉంటాయని అంటారు . అందుకే ఇప్పుడు లోకేష్ టిడిపి జాతీయస్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కాబోతున్నారని అంటున్నారు .. మరి ఈ పదవికి ఉండే లక్షణాలు అధికారులు ఏమిటి అన్న చర్చలు కూడా గట్టిగా సాగుతున్నాయి .. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపు పార్టీకి అన్ని తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు .. కేవలం అధ్యక్షుడికి మాట చెప్పి అంతా తానే పార్టీని నడిపిస్తూ ఉంటారు ..
అలాగే అధ్యక్షుడు పేరు మీద అధ్యక్షుని సూచనల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తూ ఉంటారన్నది పార్టీ రాజ్యాంగంలో చెప్పిన అధ్యక్షడుగా ఉన్నది చంద్రబాబు , లోకేష్ .. ఇక దాంతో ఇద్దరు ఒకటే కాబట్టి అంతా లోకేష్ చేతుల మీదనే పార్టీ నడుస్తూ ఉంటుందని అంటున్నారు . అలా లోకేష్ ఇప్పుడు ఈ మహానాడు తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మారబోతున్నారని కూడా అంటున్నారు .. అలాగే దేనికైనా టైం ప్లేస్ ఎంతో ముఖ్యమని కూడా అంటారు .. అలాగే టైం అయితే వచ్చేసింది లోకేష్ కి కీలక పదవి దక్కటానికి ఇదే సరైన సమయమని కూడా అంటున్నారు .. ఎన్నికలకు చాలా దూరం ఉన్న కారణంగా లోకేష్ కి పగ్గాలు అప్పజెబితే ఆయన సరైన సమయానికి పార్టీని నడిపేసారైనా సారథిగా మారుతానని కూడా అంటున్నారు.
అలాగే ఇక ప్లేస్ చూస్తే కడప గడ్డ .. అది వైసీపీ అధినేత సొంత జిల్లా .. ఇక మరి అక్కడే లోకేష్ కి కొత్త బాధ్యతలు అందుకుంటారు అన్నమాట .. ఆ విధంగా అయిన ప్రత్యర్థికి పెను సవాల్ విసురుతున్నారని కూడా చెప్పవచ్చు .. జగన్ గడ్డ నుంచి తన మరో ప్రస్థానం మొదలుపెట్టేందుకు ఆయనకు దాటిగా చెప్పేందుకు ఈ ప్లేస్ ఎంపిక అయిందని అంటున్నారు .. అందుకే ఊరికే కడపలో మహానాడు పెట్టలేదు అన్నది కూడా అందరికీ అర్థమవుతుంది .. దట్ ఇజ్ చంద్రబాబు అని కూడా ఇక్కడ చెప్పుకోవాలి ఏది ఏమైనా లోకేష్ ఫ్యూచర్ సీఎం ఫీచర్ ఆఫ్ టిడిపి ఏపీలో ఆయన నవతరం నాయకుడు .. అచ్చమైన రాయలసీమ బిడ్డ సీమలో బలంగా ఉందని భావిస్తున్న వైసీపీకి అక్కడే రీ సౌండ్ చేయడం ద్వారా గట్టి బదులు చెప్పేందుకే ఈ మహానాడు అని అంటున్నారు .. ఇక మరి ఈ మహానాడు తర్వాత టిడిపిలో తెలుగు రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి .