మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేస్తున్నటువంటి టూర్ల వల్ల కూటమి ప్రభుత్వం భయపడుతోందనే విధంగా గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు కారణం జగన్ కి ఇస్తున్న పర్మిషన్స్ విషయం పైన కూడా కండిషన్స్ పెడుతున్నారు. పదిమందితోనే వెళ్లాలి, కేవలం ఐదు మందితోనే వెళ్లాలి.. ఈ టైపులో వెళ్లాలని చెబుతున్నారు ఒక పార్టీ నాయకుడిగా అది సాధ్యమవుతుందా?. కానీ రోడ్డుమీదికి జగన్ వెళితే ఎగబడి వచ్చేటువంటి దృశ్యాలు సినిమా సెలబ్రిటీల తర్వాత కేవలం అంతటి దృశ్యాలు మళ్లీ మాజీ సీఎం జగన్ వెళ్లే టూర్లలో కనిపిస్తోంది.


రాజకీయం ప్లస్ సినిమా స్టార్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి కూడా ఉన్నది.. అయితే వారి వెనకాల ఐదుగురిని తీసుకువెళ్లాలనుకున్న.. చూడడానికి వచ్చేటువంటి జన కొన్ని వందలు, వేళల్లో ఉంటారనే విషయం  తెలిసిందే. పైగా నువ్వు రావద్దు అని చెబితే మరింత వేగంగా వస్తారు. ఆపడానికి ప్రయత్నిస్తే మరింత గట్టిగా ప్రయత్నిస్తారు. గుంటూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన కావచ్చు ,మొన్న సత్తెనపల్లి దగ్గర జరిగింది కావచ్చు.. ఇలాంటివి చూసిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయాలి.




కానీ ప్రభుత్వం మాత్రం ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా నోటీసులు ఇవ్వడం, లేకపోతే పర్మిషన్ కేవలం పదిమందికే అనడం వంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే జగన్ అంటే అంత భయపడుతోందని వైసిపి నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా జగన్ వెనకాల వచ్చేటువంటి జనం ఆ సందడి కనిపిస్తూ ఉంటుంది.. మనం డబ్బులు ఇచ్చి, బస్సులు పెట్టి, భోజనాలు పెట్టి ఇంకా చేసిన కూడా మన దగ్గరికి వచ్చే జనంతో కంపేర్ చేస్తే..జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే జనమే ఎక్కువగా  వింటున్నారని కోపంతోనే ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారంటు  వైసిపి కార్యకర్తలు ,నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మరి రేపటి టూర్ ఎలా ఉంటుంది జగన్ అభిమానులు విజయవంతంగా చేస్తారా.. ప్రభుత్వ వ్యూహాలు విజయవంతం అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: