
గడచిన రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారని అయినప్పటికీ కూడా సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిసింది .అధికారులతో అన్ని విషయాలను చర్చించి వెళ్లిన తర్వాత తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ వెంటనే వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించగా వైద్యులు సైతం విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. అలా ఒకపక్క జ్వరంతో బాధపడుతూనే తన శాఖపరమైన విషయాల పైన టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పి.ఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ట్వీట్ వైరల్ అవుతోంది.
ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే మరొకపక్క ఓజి సినిమా రిలీజ్ అవుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరో కొద్ది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి మరి ఆ అసెంబ్లీ సమావేశాలకు పవన్ కళ్యాణ్ వెళ్తారో లేదో చూడాలి మరి.