ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాను వల్ల ఏపీలో చాలా ప్రాంతాలు అతలాకుతలం చేసింది. ఈ తుఫాను ప్రభావం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు ఒక్కసారిగా జలమయం పెరగడంతో పలు ప్రాంతాలలో మండలాలు ,గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ముంపు ప్రాంతాల, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.


అలాగే మరొకవైపు తుఫాను వల్ల ఏపీలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ .5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా రైతుల సాగు చేసుకున్న పంటలు కూడా పూర్తిగా దెబ్బ తిన్నాయి..మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 304 మండలాలలో, 1800 పైగా గ్రామాలలో పంట నష్టం వాటిలిందని అంచనా వేస్తున్నారు. మొత్తం 87 వేల హెక్టార్లలో ఈ పంట నష్టం జరిగినట్లు అధికారుల అంచన వేస్తున్నారు.


59 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న , మినుము పంట భారీగా నష్టం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు సాగుచేసిన పంటలు చాలా దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే 42 పశువులు మృతి చెందాయని తెలియజేస్తున్నారు. క్షేత్ర  స్థాయిలో పరిస్థితి పరిశీలించిన తర్వాత ఈ సంఖ్యలు పెరిగే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, ప్రకాశం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, వైయస్సార్ కడప, కోనసీమ, ఏలూరు ఇటువంటి ప్రాంతాలలో పంటలు చాలా దెబ్బతిన్నాయి. ఇందులో వరి ,మొక్కజొన్న, సజ్జ, రాగి, పసుపు, అరటి, ఉల్లి, కంది వంటి పంటలు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: