జగన్ ప్రభుత్వ కాలంలో గన్నవరం టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి అందరికీ తెలిసిందే. అప్పట్లో కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే ఉద్యోగి ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సత్యవర్ధన్ను బెదిరించి, ఒత్తిడి తెచ్చి, కేసు నుండి తప్పించుకునేందుకు ఆయనను కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. అతడిని తమ మాట ప్రకారం కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రమైన ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. భయంతో సత్యవర్ధన్ వైసీపీ నాయకులకు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు.
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. కిడ్నాప్కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో మళ్లీ సంచలనం రేగింది. ప్లాన్ ప్రకారం సత్యవర్ధన్ను ఎత్తుకుపోయిన అంశాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించడంతో పోలీసులు కేసును రీ–ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీతో పాటు పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. కొంతకాలం తర్వాత కేసు నెమ్మదిగా బ్యాక్సీట్లోకి వెళ్లిపోయినప్పటికీ, న్యాయం కోసం కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే మసకబారుతున్న ఈ కేసు అనూహ్యంగా మళ్లీ హైలైట్ అయ్యేలా ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిశ్శబ్దంగా ఉండే సమయంలోనే ఈ కేసును మళ్లీ ముందుకు తెచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. న్యాయం జరిగే వరకు ఈ కేసు కొనసాగాలని, నిజమైన నిందితులు శిక్షించబడాలని ఆయన బలంగా చెప్పినట్టుగా పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
అంత వరకు పెద్దగా శ్రద్ధ పొందని ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు, కోర్టులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. కిడ్నాప్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రకుమార్, రాము కోర్టులో లొంగిపోవడంతో ఈ వ్యవహారం మరింత సీరియస్ అయ్యింది. కోర్టు విచారించాక 15వ తేదీ వరకూ వారికి రిమాండ్ విధించడం కేసు మరో కీలక దశలోకి ప్రవేశించిందని సూచిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి