రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఉన్న ఖతు శ్యామ్  ఆలయం కోట్లాదిమంది భక్తుల విశ్వాస కేంద్రంగా మారింది .. ఇక్కడ సింహాసనం పై ఉన్న ఖతు శ్యామ్  మనోహరమైన విగ్రహం భక్తులకు ఎంతో అద్భుతం .  అలాగే ఈ విగ్రహానికి సంబంధించి ఎన్నో ఆసత్యకరమైన రహస్యాలు ఉన్నాయి .. వాటి గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు .. ఈ ఆలయంలో ఉన్న ఖతు శ్యామ్  విగ్రహం రంగులో నెలలో రెండుసార్లు మార్పు వస్తుంది .. ఇది నిజం ఖతు శ్యామ్  విగ్రహం కృష్ణ పక్షంలో పసుపు రంగులోకి , శుక్ల ప క్షంలో నల్ల రంగులోకి మారుతుంది .. ఇది ఎలా జరుగుతుంది దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం .


విగ్రహం ఈ రంగు మార్పు వెనక కారణం , అలంకర ,ణ అభిషేకం ప్రత్యేకమైన సంగమం ఖతు శ్యామ్  విగ్రహం రంగు మారడానికి ముఖ్య కారణం .. ఆయన ప్రత్యేక అలంకరణ , అభిషేక ప్రక్రియ .. అయితే ఇది సహజమైన లేదా అత్యంద్రియ సంఘటన కాదు .. ఆల‌య‌ సంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక సంప్రదాయం లో ఒక భాగంగా వస్తుంది . ప్రధానంగా కృష్ణపక్షం వచ్చిన సమయంలో బాబా శ్యామ్ విగ్రహానికి పసుపు వరణంగా అలంకరిస్తారు .  అలాగే ఆ సమయంలో విగ్రహానికి పసుపు రంగు దుస్తులను అలంకరణకు ఉపయోగిస్తారు .. అలాగే పసుపు రంగు తరచుగా లేత బంగారు రంగుతో కూడి ఉంటుంది .. ఇది విగ్రహాన్ని మరింత నలుపు రూపాన్ని దైవికంగా చూపిస్తుంది .. అలాగే ఆ సమయంలో ఖతు శ్యామ్ భక్తులకు కృష్ణుడిలా కనిపించే రూపంలో దర్శనమిస్తాడు .



అదే విధంగా శుక్లపక్షంలో నలుపు రంగు వచ్చేలా బాబా శ్యామ్ తన పూర్తి శాలిగ్రామ రూపంలో అలంకరించబడతాడు .. శాలిగ్రామ అనేది విష్ణు పవిత్ర రూపం .. ఇది సాధారణంగా నలుపు లేదా ముదురు రంగులో కనిపిస్తుంది .. ఇక ఆ సమయంలో విగ్రహానికి కూడా ప్రత్యేక పద్ధతిలో అభిషేకము చేస్తారు .  ఆ తర్వాత ఇది ముదురు నల్లగా భక్తులకు దర్శనమిస్తుంది .. ఇక ఈ నలుపు రంగు విగ్రహం దైవత్వం శాశ్వతం సకల లోకాలకు ప్రభువుగా ఉంటారని సూచిస్తుంది .అయితే ఈ విగ్రహం రంగు మార్పు భక్తులకు ఓ పెద్ద రహస్యం .. అయితే ఇది కొన్ని దశాబ్దాల నాటి ఆలయ సంప్రదాయాలో ఒక భాగం .. ఇక్కడ ఈ దేవుడిని అతని వివిధ లక్షలాలను, దైవిక చర్యలను వర్ణించే వివిధ రూపాల్లో కూడా అలంకరిస్తారు . పలు మతమారమైన ప్రాముఖ్యత నమ్మకాలు ఖాతూ శ్యామ్ ని కలియుగ అవతారంగా కూడా కలుస్తారు .  ప్రధానంగా మహాభారత కాలంలో ఘటోత్కచుని కుమారుడు భీముని మనుమడు బార్బరికుడు తన తలను శ్రీకృష్ణుడికి దానం చేశాడని అందరూ నమ్ముతారు .  అయితే కలియుగంలో ఆయన పేరు మీద పూజలు అందుకుంటారని శ్రీ కృష్ణుడు ఆశీర్వాదంతో ఇప్పుడు ఖతు శ్యామ్ గా ఆయన అవతరించారని భ‌క్తుల విశ్వాసం ..

మరింత సమాచారం తెలుసుకోండి: