రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన డూప్లెసిస్ ను ఒక బాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. దీంతో అభిమానులకు నిరాశ తప్పడంలేదు. అదేంటి ఈ ఐపీఎల్ సీజన్ లో అతను బాగానే రాణిస్తున్నాడు. బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఐపీఎల్ సీజన్ లో కాదు ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్లో డూప్లేసిస్ ని సెంచరీ విషయంలో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది. ఇటీవలే లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో 96 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన  డూప్లేసెస్ నాలుగు పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఇంతవరకు సెంచరీ లేని డూప్లేసెస్  ఈ సారి సెంచరీ సాధిస్తాడని అనుకుంటే మళ్లీ అభిమానులకు నిరాశ ఎదురైంది.


 ఐపీఎల్లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సమయంలో 2019లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 96 పరుగుల వద్ద  వికెట్ కోల్పోయాడు డూ ప్లేసెస్. 2021 ఐపీఎల్ సీజన్లో కోల్కతా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కి ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్ 95 పరుగుల వద్ద నాటౌట్గా నిలిచి సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు.  ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లో 88 పరుగులు చేసి సెంచరీకి కాస్త దూరం లో అవుట్ అయిపోయాడు.


 ఇలా డూప్లేసెస్ భారీగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నప్పటికీ అతనికి సెంచరీ కల మాత్రం నెరవేరడం లేదు అన్నది తెలుస్తుంది. ఎంతో దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసే లాగే కనిపించిన డుప్లెసిస్  ఒక్క అడుగు దూరంలో చివరికి సెంచరీ చేజార్చుకుంటు ఉండడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్లో నాలుగు సార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికీ మూడు సార్లు అవుట్ గా.. ఇక ఒక సారి నాటౌట్ గా మిగిలి సెంచరీ అందుకోలేకపోయాడు. దీంతో ఇది తెలిసిన క్రికెట్ అభిమానులు డూప్లెసిస్ కు సెంచరీ చేసి యోగ్యం లేనట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి తర్వాత మ్యాచ్లలో అయినా డుప్లెసిస్ సెంచరీ సాధిస్తాడో లేదో అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl