ఇక IPL 2023 మార్చి 31 వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ, అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో షారుఖ్ ఖాన్ జట్టు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ యొక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు.ఇక ఈ గాయం కారణంగా అతను ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో అయ్యార్ గాయం కారణంగా తరువాత జరగబోయే వండే మ్యాచ్ తో పాటు ఇక ఐపీఎల్ 16 వ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని సమాచారం తెలిసింది.ఇక ఇలాంటి పరిస్థితిలో కేకేఆర్ జట్టు బాధ్యతలు చేపట్టగల  ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వెస్టిండీస్ వెటరన్, భయంకర తుఫాన్ బ్యాట్స్‌మెన్ అయిన ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ళలో ఒకడు. చాలా సందర్భాలలో ఇతను ఒక్కడే ఒంటరిగా తన జట్టును గెలిపించాడు. రస్సెల్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా సూపర్ గా మ్యాజిక్ చేస్తాడు. దీంతో అయ్యర్ లేకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ రస్సెల్‌ను కెప్టెన్‌గా చేయవచ్చని సమాచారం తెలుస్తోంది.అలాగే న్యూజిలాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా కేకేఆర్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించడం చూడొచ్చు. ఎందుకంటే సౌదీ చాలా సందర్భాల్లో కివీ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇంకా అదే సమయంలో ప్రస్తుతం న్యూజిలాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కూడా అతను ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో కోల్‌కత్తా టీం అతని కెప్టెన్సీ అనుభవం నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందవచ్చని సమాచారం తెలుస్తోంది.అందుకే అయ్యర్ స్థానంలో ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్‌గా చేయవచ్చు.ఇంకా అలాగే నితీష్ రాణా కూడా చాలా కాలంగా కేకేఆర్ తరపున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా అతను వ్యవహరించాడు. అదే సమయంలో కేకేఆర్‌ జట్టుతో చాలా కాలంగా ఉన్న అనుబంధం కారణంగా  కూడా అతనికి చాలా మంచి అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితిలో అయ్యర్ గాయం కారణంగా IPL నుంచి తప్పుకుంటే, నితీష్ రాణా కూడా కేకేఆర్ కెప్టెన్‌గా మారే ఛాన్స్ వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: