
ఒకరకంగా ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ప్లేయర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఐపీఎల్ లో రాణించి గుర్తింపును సంపాదించుకున్న వారే అనడంలోనూ సందేహం లేదు. ఇక ఇలా ఐపీఎల్లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్ లో ఛాన్స్ దక్కుతుంది అన్న విషయం ఇటీవలే మరో ప్లేయర్ విషయంలో నిజం అయింది అని చెప్పాలి. 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున శ్రీలంక యంగ్ బౌలర్ మతిషా పతిరణ మంచి ప్రదర్శన చేశాడు. జూనియర్ మలింగ గా పేరు సంపాదించుకున్న పతీరన ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలవడంలో ప్రధాన పాత్ర వహించాడు అని చెప్పాలి. తన బలంతో ప్రత్యర్థులను వనికించాడు.
ఈ క్రమంలోనే ఐపిఎల్ ముగిసిన వెంటనే ఏకంగా శ్రీలంక టీం తరఫున వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంక ఆడబోయే ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నీలో కూడా ఆడే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు జరగబోయే వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లలో పతిరణ మంచి ప్రదర్శన చేశాడు అంటే ఇక భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా అతను శ్రీలంక టీం తరపున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉంది అని చెప్పాలి.