ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐసీసీ మెగా టోర్ని గురించి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. కాగా ఇక వరల్డ్ కప్ కి ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం.  ఇకపోతే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇండియా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే  ఏ టీం ఏమైదానంలో ఎప్పుడు మ్యాచ్ ఆడబోతుంది అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ షెడ్యూల్ కు అనుగుణంగానే అన్ని టీమ్స్ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి.


 ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ షెడ్యూల్ విషయంపై ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సాధారణంగా అయితే చిరకాల ప్రత్యర్ధులు అయినా పాకిస్తాన్ ఇండియా పోరు అక్టోబర్ 15వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఇక భద్రత కారణాల దృశ్య ఈ మ్యాచ్ షెడ్యూల్ను మార్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేవలం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కి సంబంధించిన షెడ్యూల్ మాత్రమే మారుస్తారా లేదా ఇక పూర్తి షెడ్యూల్లో మార్పులు చేస్తారా అనే విషయంపై గత కొంతకాలం నుంచి కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి బిసిసిఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ప్రపంచ కప్ షెడ్యూల్ గురించి కీలక ప్రకటన చేశారు.   ప్రపంచ కప్ తేదీలలో మార్పులు ఉంటాయి అంటూ స్పష్టం చేశారు. అయితే కొత్త షెడ్యూల్ 2 లేదా మూడు రోజుల్లో రిలీజ్ చేస్తాము అంటూ వెల్లడించారు. మరి కొన్ని రోజుల్లో అటు టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమవుతాయి అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరికీ ఉచితంగా తాగునీరు అందించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము అంటూ తెలిపాడు. అదే సమయంలో భారత స్టార్ బౌలర్ బుమ్రా పూర్తిగా ఫిట్గా ఉన్నాడని జై షా భారత్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: