భారత జట్టులో ప్రత్యర్ధులను భయపెట్టే ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా చెప్పేస్తారు అతను బుమ్రా అని. ఏకంగా ఇండియన్ క్రికెట్ లవర్స్ ఈ బౌలర్ ని ఫేస్ గుర్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు బుమ్రా. అంతేకాదు టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఇక భారత జట్టు కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు బుమ్రా తన బౌలింగ్ తో గట్టేక్కించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి.  అలాంటి బుమ్రా  గత కొంతకాలం నుంచి గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.


 ఏకంగా వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మధ్యలో ఒకసారి పునరాగమనం చేశాడు. కానీ ఒక్క మ్యాచ్ లోనే పాత గాయం తిరగబెట్టడంతో చివరికి సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అతను లేకుండానే అటు టీమిండియా కొన్ని మేజర్ టోర్నీలు కూడా ఆడి విఫలం అయింది అని చెప్పాలి. ఇక అతను వస్తే తప్ప టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారదు అని ఎంతో మంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాదాపు 11 నెలల తర్వాత మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేశాడు బుమ్రా.


 ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టుకు ఎంపిక కావడమే కాదు కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు. అయితే ఇన్ని నెలలు గ్యాప్ తీసుకున్న బుమ్రా మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకోలేడని.. ఇక వరల్డ్ కప్ ఆసియా కప్ కు సెలక్ట్ అవ్వడం కూడా కష్టమే అంటూ కొంతమంది విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శకుల నోళ్లు ముయించే విధంగా ఐర్లాండ్తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లోనే అదరగొట్టాడు బుమ్రా. ఇక మొదటి టి20 లో మొదటి ఓవర్ వేసి ఇక ఓకే ఓవర్ లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి ఐర్లాండ్ ను దెబ్బ కొట్టాడు. దీంతో బుమ్రా ఇస్ బ్యాంక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో.. రెండు పరుగులు తేడాతో  డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇండియా విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: