బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో అత్యధిక టాప్ టీఆర్పీ రేటింగ్ ను సాధించిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే ప్రోగ్రాం కి కానీ, ఏ సీరియల్ కానీ , షో కి కానీ లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీకదీపం సీరియల్ కు సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అంతా ఫ్యాన్సే.. ఇక టీ ఆర్ పీ రేటింగ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క సీరియల్ కూడా ఈ సీరియల్ తో పోటీ పడటానికి సిద్ధంగా లేదు. ఇప్పటివరకు తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ, అత్యధిక టీ ఆర్ పీ రేటింగ్ సాధించి,మొట్టమొదటి స్థానంలో నిలుస్తోంది కార్తీకదీపం.. ఇందుకు ముఖ్య కారణం ఇందులో నటించే వంటలక్క, డాక్టర్ బాబు, సౌందర్య నటన ఈ సీరియల్ కు  హైలెట్ గా నిలిచాయి.



కార్తీక దీపం సీరియల్  మొదటి రోజు నుంచీ మంచి పాజిటివ్‌ టాక్‌తో టాప్‌ టీఆర్పీ రేటింగ్ రాబడుతూ , దేశంలోనే అత్యధిక రేటింగ్‌ సాధించిన మొదటి సీరియల్‌గా నిలిచింది. ఈ సూపర్‌ హిట్‌ సీరియల్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా ?  అని సామాన్య  ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అందులో ముఖ్యంగా మంచు లక్ష్మీ వాళ్ల అమ్మ  కూడా కార్తీకదీపం సీరియల్ కు పెద్ద ఫ్యాన్ అట. ఈ సీరియల్ కోసం ఆమె సాయంత్రం నుంచి వెయిట్ చేస్తుంది అని కూడా మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు..


ఇదిలా ఉండగా,తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ  చాలా యాక్టీవ్‌గా ఉంటూ, ఆమె జీవితంలో జరిగే ప్రతి క్షణాన్ని అభిమానులతో పంచుకునే అలవాటు మంచు లక్ష్మీ కి  ఉంది. ఇక అందులో భాగంగానే కార్తీకదీపం సీరియల్ గురించి కూడా ఆమె ఒక ట్వీట్ చేసింది..  "కార్తీక దీపం సీరియల్‌ లో  డాక్టర్ బాబు, వంటలక్క దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చిన విషయం అందరికీ తెలుసు.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది "అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. "మీరు కూడా వంటలక్క అభిమానేనా లక్ష్మీగారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మంచు లక్ష్మీ ట్వీట్‌ని డాక్టరు బాబు షేర్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: