ఇప్పుడున్న సోష‌ల్ మీడియాలో ట్విట్ట‌ర్‌ది ప్ర‌త్యేక మైన స్థానం. ప్ర‌తి ఒక్క‌రూ ట్విట్ట‌ర్‌లోనే స్పందిస్తుంటారు. రాష్ట్ర‌ప‌తి నుంచి సామాన్యుడి వ‌ర‌కు ఇది అంద‌రి వేదిక‌గా ఉంది. అలాంటి అంత‌ర్జాతీయ యాప్ ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే స‌బ్ స్క్రిప్ష‌న్ సేవ‌ల‌ను మొద‌లు పెట్ట‌బోతోంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా చార్జీలు కూడా వ‌సూలు చేయ‌బోతోంది.

ట్విట్టర్ బ్లూ పేరుతో రానున్న ఈ ప్లాట్‌పాంలో సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీగా నెలకు 2.99 డాలర్లను ట్విట్ట‌ర్ వసూలు చేయనుంది. ఈ సేవల గురించి ట్విట్టర్ నిర్ధారించింది రీసెంట్‌గా. ట్విట్టర్ యాప్ స్టోర్‌ లిస్టింగ్‌లో.. ట్విట్టర్ బ్లూ ఇన్-యాప్ పర్చేజింగ్‌ను జోడించినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ విష‌యాన్ని అధికారికంగా ఇంకా అందుబాటులోకి తీసుకు రాలేదు ట్విట్ట‌ర్‌.

అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలను ముందుగా అమెరికాలో ప్రారంభించాల‌ని యోచిస్తోంది ట్విట్ట‌ర్‌. ఇక మ‌న భారత్‌లో దీనికి రూ.200 నుంచి రూ.270 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేస్తోంది. సెక్యూరిటీ రీసెర్చర్ జేన్ మంచూన్ వాంగ్ ఈ కొత్త అప్‌డేట్‌ను ముందుగా గుర్తించారు.

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇందులో వెల్ల‌డిస్తూ ట్విట్టర్ యాజమాన్యం ట్విట్టర్ బ్లూను విడుదల చేయనుంది. యాప్ స్టోర్‌లో ఇన్‌-యాప్ పర్చేజ్‌గా దీన్ని యాడ్ చేశారు. అంటూ ఆయ‌న వెల్ల‌డించారు ఈ సేవ‌ల‌ను మ‌నం ఉప‌యోగించుకోవాలంటే చార్జీలు వ‌ర్తిస్తాయిన స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా వాంగ్ షేర్ చేశారు. అంతే కాదు ఈ యాప్ ఐకాన్‌ రంగును కూడా క‌స్ట‌మ‌ర్లు మార్చుకోవచ్చు. బ్లూ నుంచి పింక్, గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ లాంటి క‌ల‌ర్ల‌ను కూడా వాడుకోవ‌చ్చు. ఒక‌వేళ వీటి నుంచి మిన‌హాయింపు కావాలంటే కూడా వ‌ర్తిస్తుంది. ప్లేన్ థీమ్‌ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ల‌ను మీరూ వాడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: