ఇటీవల కాలం లో కుక్కల ని పెంచుకోవడం అనేది ట్రెండ్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. కొంతమంది కుక్కలపై ఇష్టంతో పెంచుకుంటే మరి కొంత మంది ట్రెండ్ ఫాలో అవ్వాలి కాబట్టి తప్పని సరిగా కుక్కలను పెంచుకుంటున్నారు. అంతే కాదు మనుషుల మీద చూపిస్తున్న ప్రేమ కంటే కుక్కల  మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు అన్న విషయం తెలిసిందే. ఇక తమ పెంపుడు కుక్కలకు ఒక మంచి పేరు పెట్టి ఇక ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు  నేటి రోజుల్లో ఎవరింట్లో చూసినా ఒక పెంపుడు కుక్క ఉండటం చూస్తూనే ఉన్నాం.


 అయితే కొంతమంది పెంపుడు కుక్కలను తెచ్చుకోవడం వాటిని గాలికి వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చి పోయే వాళ్ళని చూసి కుక్కలు అరుస్తూ ఉండడంతో ఎంతోమంది భయాందోళనకు కూడా గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది అయితే కుక్కలు మోరిగిన  పట్టించుకోకుండా వెళ్లిపోతు ఉంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.


 కుక్క అరుపులు విసుగు పుట్టిస్తున్నాయి అనే కారణంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు సదరు వ్యక్తి. కుక్క యజమాని సహా ఇరుగుపొరుగు వారి పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలు వెలుగులోకి  వచ్చాయి. కుక్క మొరిగింది అనే కారణంతో ఒక వ్యక్తి యాజమనితో ఇరుగుపొరుగు వారి పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కుక్కను కూడా రాడ్ కొట్టి చంపేశాడు. స్థానికులు వద్దు అని చెబుతున్న రెచ్చిపోయి మరీ ప్రవర్తించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: