ఇక ఒక్కోసారి సంచలనం సృష్టిద్దామంటూ అంటూ చేసే పనులు అనేవి రివర్స్ లో మనల్నే నవ్వులపాలు చేస్తాయి.అయితే ఇప్పుడు ఇదే కోవలో చేరారు ప్రముఖ నటుడు సతీష్ షా. ఇక ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా?మరో 5 రోజుల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను వాట్సప్ డీపీలుగా ఇంకా సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్స్ గా పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో నటుడు సతీష్ షా తాను చేతితో పట్టుకున్న త్రివర్ణ పతకాన్ని చాలా గర్వంగా చూపిస్తూ.. ఇక తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ ఫోటోకి ఇచ్చిన క్యాప్షనే అసలు వివాదానికి తెరలేపింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా1942 వ సంవత్సరంలో మా అమ్మకు లభించిన తిరంగ్ ధ్వజ్ అంటూఅతను పోస్టు చేశారు. ఇక దీనిని చూసిన నెటిజన్లు సతీష్ షా ఫై ఫైర్ అవుతున్నారు.సతీష్ షా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ త్రివర్ణ పతాకం మధ్యలో అశోక్ చక్రం ఉంది. అయితే 1942లో భారత జెండా మధ్యలో చరఖా అనేది ఉండేది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక చరఖా స్థానంలో ఈ అశోక్ చక్ర చేరింది. 


1921 వ సంవత్సరంలో గాంధీజీ కోరిక మేరకు పింగళి వెంకయ్య జాతీయ పతకాన్ని డిజైన్ చేశారు. కొన్ని మార్పులతో దానిని స్వరాజ్య పతాకంగా కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపయోగించారు. ఇక ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరఖా స్థానంలో అశోక్ చక్రను చేర్చి భారత జాతీయ జెండాగా ఆమోదించారు. అయితే 1942లోనే అశోక్ చక్రతో కూడిన జాతీయ జెండా ఉందంటూ సతీష్ షా ట్వీట్ చేయడంతో మీరు పోస్టు చేసిన త్రివర్ణ పతాకం ఎప్పటిదో వాస్తవం తెలుసుకోవాలని కొందరు నెటిజన్లు ఆయనకి సూచించారు. చరిత్ర తెలుసుకోండి అంటూ మరికొందరు అయితే క్లాస్ పీకారు. ఇక మాకు తెలిసినంత వరకు 1947లో జాతీయ జెండాపై అశోక చక్రను చేర్చారు. 1942లో మీకు ఇంకా మీ అమ్మగారికి ఎలా వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక సతీస్ సా అందరికీ క్షమాపణలు చెప్పాలని కొందరు అంటుంటే.. ఈ రోజుల్లో అబద్ధాలు అనేవి చెప్పడం చాలా సులభం.. అందులో సెలబ్రెటీలు దేశభక్తిని ఉపయోగించుకుంటున్నారంటూ సెటైర్లు కూడా వేశారు. ఇక దీనిపై ఇప్పటి వరకు సతీష్ షా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: