మనం అందమైన ముఖం కోసం చాలా రకాలైన ప్రొడక్ట్స్‌నే  వాడుతాం.  కానీ వాటిలో ఉండే కెమికల్స్ మన ముఖానికి చాలా రకాలుగా హాని చేస్తాయి. అయితే వీటితో కాకుండా మన ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో తయారు చేసే ఓ మిశ్రమాన్ని వాడితే ముఖ సౌందర్యం ఈజీగా పెరుగుతుంది. ఇంకా అంతేకాదు, ముఖంపై ఉండే మచ్చలు కూడా చాలా ఈజీగా పోతాయి. ఇంతకీ అసలు ఆ పదార్థాలు ఏమిటి..? ఆ మిశ్రమాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక బౌల్‌ ని తీసుకుని అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. అయితే సెన్సిటివ్ చర్మం ఉన్న వారు మాత్రం 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా వాడినా కూడా చాలు. ఇలా చెప్పిన మోతాదులో రెండు పదార్థాలను కలిపి మీరు మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తరువాత దీన్ని ముఖమంతటా రాయాలి. ఒక నిమిషం ఆగాక వేడిగా ఉన్న నాప్‌కిన్ టవల్‌తో మీరు తుడిచేయాలి. దీంతో మీకు తేడా కచ్చితంగా తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని తరచూ వాడుతుంటే  ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మం మృదువుగా ఉంటుంది.ముఖంపై ఉండే మచ్చలు ఇంకా మొటిమలు పోతాయి.ముఖం చాలా అందంగా మారుతుంది.రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని వాడితే పొడి చర్మం సమస్య అనేది ఉండదు.చర్మం మృదువుగా ఇంకా ప్రకాశవంతంగా మారుతుంది.అలాగే ముఖంపై ఉండే చర్మం పీహెచ్ స్థాయిలు కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీంతో చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే ముఖ చర్మం లోపల ఉండే రక్త నాళాల్లో రక్త సరఫరా అనేది బాగా మెరుగు పడుతుంది. దీంతో ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడవాలి. ఆ తరువాతే దీన్ని అప్లై చెయ్యాలి. అందువల్ల మంచి ఫలితం పొందవచ్చు. అయితే ఈ క్రమంలో ఈ మిశ్రమం వెంట్రుకలకు మాత్రం తగలకూడదు. లేదంటే వెంట్రుకలు అంతా కూడా జిడ్డుగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: