మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై విమర్శలు చేశారు. క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నవారికి మంచి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలో ఉండేవారికి మంచి ఆహారం అందించలేకపోతుందని విమర్శలు చేశారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా క్వారంటైన్ కేంద్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నవాళ్లు భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి మంచి ఆహారం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు. మత్స్యకారులు, వలస కూలీలు క్వారంటైన్ కేంద్రాలలో ఆహారం బాగాలేదని నిరసన తెలియజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.
The minimum responsibility of Govt is to serve quality food to people who have been quarantined. Visuals of fishermen & migrants from srikakulam agitating against the authorities for being served with bad quality food is only one of many such incidents taking place across the ap pic.twitter.com/3AXdmdxH8q
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 18, 2020