ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీల్లో ఒక‌టైన ఆ కంపెనీ సీఈవోల‌ను బ‌తిమాలి చంద్ర‌బాబునాయుడు ఏపీకి తెచ్చార‌ని, ఇప్పుడేమో ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ చెల్లించ‌లేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై  చెప్పేసింద‌న్నారు. దానివిలువ ఫ్రాడ్‌స్టార్ ఏ1 రెడ్డికి తెలుస‌ని, 9 కోట్ల షేర్లు కొని పెట్టుబ‌డిగా పెట్టార‌న్నారు. అది ఎంత పెద్ద కంపెనీయో, ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో వారికి బాగా తెలుస‌న్నారు. ఐదు రూపాయ‌ల కోసం టిక్‌టాక్‌లో  బైబై బాబూ అని పెయిడ్ వీడియోలు పెట్టిన‌ పేటీఎం కూలీలు ఇప్పుడు బైబై డెవ‌ల‌ప్‌మెంట్‌...బైబై ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ అనే వీడియోలు పెట్టాల‌ని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag