ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అసమర్థ ముఖ్య‌మంత్రి పాలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం, మాంసం, చేపలు ముఖ్య‌మంత్రి జగన్ అమ్ముతారా? అని ప్రశ్నించారు. ప‌రిపాల‌న చేతకానివారు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవాచేశారు. సన్న బియ్యం అంటే తెలియనివారు పౌరసరఫరాల మంత్రి అని,   బెట్టింగ్ రాయుడు ఇరిగేష‌న్ మంత్రి అని అయ్య‌న్న నిప్పులుచెరిగారు. లేని దిశ చట్టంతో శిక్షలు వేశామని హోంమంత్రి సుచరిత గొప్పలు చెబుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని, తక్షణమే ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఇటువంటివారంతా రాష్ట్రాన్ని ప‌రిపాలిస్తే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుంద‌ని, ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు ఉన్న స‌మ‌యంలో విదేశాల నుంచి ఇక్క‌డ కంపెనీలు పెట్ట‌డానికి వ‌చ్చార‌ని, ఇప్పుడేమో రాష్ట్రంలో ఉన్న‌వారే చిన్న ప్రాజెక్టు చేయ‌డానికి కూడా ముందుకు రావ‌డంలేద‌న్నారు. దీన్నిబ‌ట్టి ఎవ‌రు ఎలా ప‌రిపాలించారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని, ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఈసారి ఆ పార్టీ చావుదెబ్బ తింటుంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: