దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాసారు.  ముఖ్యంగా ముద్ర‌గ‌డ విశాఖ స్టీల్‌ ప్లాంట్ నేప‌థ్యంలోనే   నరేంద్ర మోడీకి ఈ లేఖ రాసారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ చేయాల‌నే ఆలోచ‌నను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ ద్వారా కోరారు ముద్రగడ పద్మనాభం.

ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగానే సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్ర‌యివేటు ప‌రం చేయడం తగదని లేఖలో వెల్లడించారు ముద్ర గడ. రైతుల సహకారం కోసం మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేసిన మాదిరిగానే భవిష్యత్‌ లో ఈ ప్రాంత ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసారు. తమ విజ్ఙప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి… ప్ర‌యివేటీక‌ర‌ణ విర‌మించుకునే నిర్ణయం తీసుకోవాలని ముద్ర‌గ‌డ‌ కోరారు. కేంద్ర ప్రభుత్వం  దీనిపై వెనక్కి తగ్గకపోతే  రాబోయే రోజుల్లో వారికే అనేక సమస్యలు  త‌లెత్తుతాయ‌ని వెల్లడించారు ముద్ర‌గ‌డ‌.


మరింత సమాచారం తెలుసుకోండి: