గత కొన్ని రోజుల నుంచి నష్టాలలో సాగుతున్న మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. అయితే వరుసగా నష్టాలతో ముగుస్తున్న మార్కెట్స్ గురువారం సైతం ఉదయం మాములుగా నష్టాలతోనే మొదలయ్యాయి. అయితే నేటి సాయంత్రానికి లాభాలతో ముగిశాయి. ఇక నేడు BSE సెన్సెక్స్ 223 పాయింట్లు లాభపడి 30602 పాయింట్ల వద్ద క్లోజ్ అవ్వగా, నేషనల్ స్టాక్ ఎంక్సైంజ్ (NSE) నిఫ్టీ 67పాయింట్లతో స్వల్ప లాభంతో 8992 పాయింట్ల వద్ద ముగిసింది. 

 


ఇక డాలర్‌ తో రూపాయి మారకం విలువ రూ.76.86 గా కొనసాగుతుంది. అయితే నేడు మొదట్లో ట్రేడింగ్ SENSEX 300 పాయింట్లు నష్టపోయింది. అలాగే NIFTY కూడా 81 పాయింట్లు నష్టపోయింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు కొనసాగుతుండటం, ఇటు పెరుగుతున్న కరోనా కేసుల కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్తపై పూర్తిగా ప్రభావం చూపుతున్నాయి. ఇక ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలకు ప్రధాన కారణమవుతున్నాయి. 

 


ఇది ఇలా ఉండగా ఉదయం నష్టాలలో ఉన్నా... ఆ తర్వాత మాత్రం బాగానే కోలుకకున్నాయి. ఇందులో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ ను కొనుగోలు చేసేందుకు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్నిరంగాల షేర్లు లాభాలు పొందాయి. అయితే ఇక గురువారం రోజున NTPC, వేదాంత, హిందాల్కో, ICICI బ్యాంకుల షేర్లు కాస్త లాభపడ్డాయి. అలాగే hpcl టెక్, టెక్ మహీంద్రా, కొటక్ మహింద్రా, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్ మొదలైన కంపెనీల షేర్లు నష్టాల బాట పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: