క్షుద్ర‌పూజ‌లు చేస్తూ ఉన్మాదిగా మారిన కిరాత‌కుడు...న‌లుగురిని న‌ర‌బ‌లిచ్చాడు. ఇందులో త‌న త‌ల్లీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి పూజ‌లు చేయ‌వ‌ద్ద‌ని వారించిన త‌ల్లిని వెంటాడి...వేటాడి చంపేశాడు. అనంత‌రం ఊరిపై బ‌డి క‌నిపించిన వారంద‌రిన చంపేసుకుంటూ వెళ్లాడు. చివ‌రికి ఓ ఆవును..దూడ‌ను కూడా బ‌లి ఇచ్చాడు. ఈ బీతావ‌హ సంఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో సర్గుజా జిల్లాలోని దేవగఢ్ గ్రామంలో జ‌రిగింది. సర్గుజా జిల్లాలోని దేవగఢ్ గ్రామానికి చెందిన ఈశ్వర్ రామ్ పైక్రా(35) క్షుద్రపూజలు చేస్తుండేవాడు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇంట్లో క్షుద్రపూజలు మొదలుపెట్టిన పైక్రా ఉన్మాదిగా మారాడు.  

 

ఏడు కోళ్లను నోటితో కొరికి వాటి ర‌క్త తాగ‌డం చూసిన పైక్రా భార్య భయపడి సమీపంలోని బంధువుల ఇంటికి పరుగెత్తుకెళ్లింది. అక్క‌డే ఉన్న  త‌న‌ అత్తకు అస‌లు విష‌యం చెప్పింది. అయితే భార్య త‌న బంధువుల ఇంటికి ప‌రుగెత్తుకుంటూ వెళ్లిన విష‌యం గ‌మ‌నించిన పైక్రా ఆమెను వెంబ‌డించాడు. భార్య త‌న బంధువులతో పైక్రా చేస్తున్న పూజ‌ల గురించి వివ‌రిస్తుండ‌గానే అక్క‌డికి చేరుకున్నాడు. అత‌ని వింత ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రూ భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. పైక్రా  చేతిలో గొడ్డలితో ఉండ‌గా క‌న్న‌త‌ల్లి తిట్ట‌డంతో మ‌రింత ఆగ్ర‌హం చెందాడు.  క్షుద్రపూజలకు బలిస్తానంటూ కన్నతల్లి రాజ్‌కువార్(60)ని వెంటాడి వేటాడి గొడ్డలితో దారుణంగా నరికేసి నరబలి ఇచ్చాడు. 

 

తల్లి చనిపోయాక ఊరిపై ప‌డ్డ పైక్రా కనిపించిన వాళ్లని కనిపించినట్లు నరకడం మొదలెట్టాడు. ఇలా సమీపంలోని ఇళ్లలో ఉన్న మన్వాసియా కన్వర్(70), జబ్బార్ సాయి కన్వర్(80), మోహన్ సాయి(50)ల‌ను అతి దారుణంగా హ‌త్య చేశాడు. ఓ ఆవు, దాని దూడని కూడా దారుణంగా న‌రికి చంపాడు. అయితే న‌లుగురిని చంపేయ‌డంతో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న గ్రామ‌స్థులు అంతా ఏక‌మై పైక్రాను ప‌ట్టుకుని అత‌ని చేతిలో ఉన్న గొడ్డ‌లిని లాగేసుకుని చిత‌క‌బాదారు. స‌మాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  అయితే అతని మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: