ఏపి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త ఆలొచనలు చేస్తారు. అంతేకాదు వాటిని అంతే జెట్ స్పీడ్ లో అమలు చేస్తారు. ఆయన సీఎం అయిన తర్వాత కరొన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నే వెలుగు లోకి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ.. ఇందులో భాగంగా చాలా మంది యువత కు ఉద్యొగ అవకాశాలు కూడా కలిపించారు. అయితే వాళ్ళు చాలా వరకూ అందరికి సాయం అందించారు.. ఎందరికో సాయంగా నిలిచారు. మరి కొంత మంది అధికార ప్రభుత్వం మాది అంటూ వేరే కార్య కలాపాలకు పాల్పడుతున్నారు.


మహిళల పై దాడులు చెస్తున్నారు. ఇప్పటికే ఎన్నో దాడులు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా విజయవాడలో వెలుగు చూసాయి. ఇది నిజంగా బాధాకరం. ఇప్పటికే కొన్ని ఘటనలు జరగడంతో  ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. వాలంటీర్ వక్ర బుద్ది బయట పడింది.. ఈ దారుణ ఘటన విజయవాడ లో వెలుగు లోకి వచ్చింది.


యువతి ఇంట్లోకి చొరబడి అసభ్యంగా వ్యవహరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ గ్రామ వాలంటీర్. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మ గట్టులో వాలంటీర్ నాగేంద్ర ఓ యువతి ఇంట్లో చొర బడ్డాడు. అతడు అసభ్య చేష్టలను గమనించిన యువతి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి వాలంటీర్ ను పట్టుకుని బంధించారు. పెళ్లీడు యువతి తో అసభ్యంగా వ్యవహరించిన నాగేంద్ర ను శిక్షించాలని, అంతేకాదు అతని వల్ల యువతి కి తీవ్ర అన్యాయాన్ని  జరిగిందని, వెంటనే న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అతని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి రిమాండ్ కు తరలించారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: