ఏదో ఒక రూపంలో ఇలా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా సిమ్ విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. సిమ్ కొనే సమయంలో ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రూఫ్ లను ఇక సైబర్ నేరాలకు తీసుకుంటున్న సిమ్ కార్డును విక్రయించే డీలర్లు కొంతమంది నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఇంకొంతమంది వినియోగదారులకు తెలియకుండా అదే ప్రూఫ్ లతో నకిలీ సిమ్ లు తీసుకోవడం కూడా చేస్తున్నారు. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకనుంచి కొత్త సిమ్ కార్డులు జారీ చేసే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సిమ్ కార్డును విక్రయించేవారు ముందుగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది ఆ తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరి అని టెలికామ్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒకవేళ సిమ్ కార్డులు వినియోగిస్తున్న డీలర్లు ఎవరైనా ఇలాంటి నిబంధన ఉల్లంఘించారు అంటే ఏకంగా 10 లక్షల వరకు జరిమానా విధించబోతున్నట్లు తెలిపారు. అందుకే సిమ్ కార్డు విక్రయించే డీలర్లు ముందుగా పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధన వల్ల నకిలీ సిమ్ కార్డుల సంఖ్యను తగ్గించడంతోపాటు సైబర్ నేరాలు అరికట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి