తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా కదులుతోంది. రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలోని 12,733 పంచాయతీలకు, లక్షా 12 వేల 288 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఈ కమిషన్ నిర్ణయించింది. యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని అతిక్రమించకుండా సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది.ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను తుది రూపం ఇవ్వనుంది.

హైకోర్టులో ఈ నెల 24న జరగబోయే విచారణకు ముందే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ నెల 24 లేదా 25లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది.మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించి డిసెంబరు 16లోపు పూర్తి చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత పోలింగ్ డిసెంబరు మొదటి వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రత, ఏర్పాట్లు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

పంచాయతీ ఎన్నికలు డిసెంబరులోనే జరపాలన్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీసీ రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చినా హైకోర్టు బ్రేక్ వేయడంతో అది అమలు కాలేదు. ఇప్పుడు తక్కువ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సివస్తోంది. మరి బీసీలను రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బలాన్ని పరీక్షించే మొదటి పెద్ద పరీక్షగా మారనున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: