ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రజల సంతోషం కోసం జగన్ వరుస పథకాలను అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు ఏపి లోని నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను అందించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం లోప్రస్తుతం ఉన్న 1889 రకాల వ్యాధులతో పాటు ఈనెల 19వ తేదీ నుంచి అదనంగా మరో 46 రకాల క్యాన్సర్ చికిత్స విధానాలను చేర్చారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున తెలియజేయజేశారు.



ఇకపోతే కొన్ని కొత్త చికిత్సలను చేర్చారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం హెల్త్ కార్డు కలిగిన వారందరూ కొత్తగా చేర్చిన క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ పథకాలకు సంబందించిన మరిన్ని వివరాలను www.ysraarogyasri.ap.gov.in లో చూడవచ్చని తెలిపారు. ఇందుకోసం 18004251818 టోల్ ఫ్రీ నెంబర్ కూడా పని చేస్తోందని.. ఈ నంబర్‌కు ఫోన్ చేసినా సమాచారం లభిస్తుందని తెలిపారు.



చికిత్స పొందాలనుకునే వాళ్లు ఏదైనా నెట్‌వర్క్ హాస్పిటల్ లోని ఆరోగ్య మిత్ర ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మల్లిఖార్జున పేర్కొన్నారు.అప్పులు చేసి వైద్యం చేయించుకుని.. ఆ నగదు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే విధానం మారాలని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కోసం పంపే దరఖాస్తుల సంఖ్యను భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఏపి లో నగదు రహిత వైద్యానికి కావలసిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సంభందిత అధికారులకు సూచించారు. అంతేకాదు ఈ పథకం విజయం కావాలంటే ఉద్యోగులు కావాలి.. అందుకే ఇప్పుడు అందులో ఖాళీలను పూర్తి చేసే ఆలోచనలో ఏపి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే ప్రజల అవసరం కూడా తీరుతుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: