
ఆపిల్:
పోషకాల నిధి గా పిలువబడే ఆపిల్ లో 80 శాతం నీరు ఉంటుంది. అంతే కాదు అధికంగా మినరల్స్ , విటమిన్స్ ఉన్న ఆపిల్ రసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. జీవక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు గుండె సంబంధిత సమస్యలను కూడా ఈ జ్యూస్ దూరం చేస్తుందని చెప్పవచ్చు.
దోసకాయ:
ఈ కాలంలో విరివిగా లభించే దోసకాయలో కూడా 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో అధికంగా లభించే పొటాషియం వల్ల వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దోసకాయలో వుండే ఫిసెటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్ కారణనంగా మెదడు మెరుగైన పనితీరుకు తోడ్పడుతుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయ రసం తాగడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా 90 శాతం నీరు అధికంగా లభిస్తుంది. పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ రసం గుండె జబ్బులను దూరం చేయడంలో సహాయపడుతుంది.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులలో మనకు విటమిన్ డి తో పాటు విటమిన్ బీ 2 అధికంగా లభిస్తుంది. నీటి శాతం అధికంగా లభించే పుట్టగొడుగులు తినడం వల్ల అలసటను తగ్గించుకోవచ్చు.