
వాము కండరాల్లో ఏర్పడే నొప్పులను తగ్గిస్తాయి. మహిళల్లో ఋతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే కడుపులో ఏర్పడే నొప్పులు, అపాయవాయువు, గ్యాస్ తో కూడిన త్రేనుపులు వంటి సమస్యల్ని వాము నివారిస్తుంది. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడం, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపర్చడం, జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వాము వలన కలుగుతాయి.
వాము మగవారికి ఎంతో మేలును చేస్తుంది. వాము, చింత గింజల పొడి మరియు వెన్న ఈ మూడింటిని ఒక స్పూన్ పరిమాణంలో తీసుకొని తర్వాత తేనె కలిపిన పాలు తీసుకోవడం వలన అకాల స్కలనం తగ్గడంతో పాటు, వీర్యకణాల సంఖ్య పెరుగుట,మరియు పురుషులలో లైంగిక పటుత్వం కలుగుతాయి.. ఫలితంగా సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది. ఇకపోతే వాము మనకు కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రధమంగా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది . ముఖ్యంగా వామును రెండు రోజులకు ఒకసారి నోట్లో వేసుకొని నమలడం వల్ల నోట్లో ఉన్న క్రిములు నశించడమే కాదు.. దుర్వాసన కూడా దూరం అవుతుంది..పైగా చిగుళ్ల వాపు , దంతాల నుంచి రక్తస్రావం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.వాము వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకె.. వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉంటారు.