జూన్ 25వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 తొలి టెస్ట్ క్రికెట్ : భారతదేశం మొట్టమొదటి సారిగా 1932 జూన్ 25వ తేదీన అధికారికంగా తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ని లార్డ్స్ మైదానంలో ఆడింది. 

 

 భారత దేశంలో ఎమర్జెన్సీ : భారత దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఎంతో ప్రభావితమైన పాలన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో తమ వ్యతిరేక శక్తులను అడ్డుకోవడానికి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  ఇక ఈ అత్యవసర పరిస్థితి వల్ల ఎన్నో అసంఘటిత పరిణామాలు చోటుచేసుకున్నాయి  భారత్ లో . 

 

 ప్రపంచ కప్  : ఒక సాదా సీదా జట్టుగా ప్రపంచ కప్ లో అడుగుపెట్టిన భారత జట్టు వరుసగా విజయాలు అందుకుంటూ... చివరికి ఫైనల్ కు  చేరింది. ఇక భారత జట్టు చిరకాల కల అయినా ప్రపంచకప్ను 1983 జూన్ 25వ తేదీన కపిల్ దేవ్ సారథ్యంలోని ఇండియా జట్టు గెలుచుకుంది. 

 

  శ్రీరామ శాస్త్రి జననం : భాషా శాస్త్రవేత్త సాహిత్య విమర్శకులు, జ్యోతిష్య శాస్త్ర పండితుడు అయిన వఝల సీతారామ శాస్త్రి 1878 జూన్ 25వ తేదీన జన్మించారు. పలు శాస్త్రాలను అభ్యసించి సీతారామశాస్త్రి ఎన్నో రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా ద్రవిడ భాషల పరిశీలన తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషి చేశారు అని చెప్పాలి. తెలుగు వ్యాకరణాల తీరుతెన్నులు విషయంలో కూడా ఆయన తన లోతైన పరిశోధనలు వెలువరించారు. భాషా శాస్త్ర పరిశోధనల్లో భాగంగా ద్రావిడ భాషలు పరిశోధిస్తూ ద్రావిడ భాషా పరిశీలన, పలు ద్రావిడ భాషలలోని పోలికలను భేదాన్ని వెల్లడించే ద్రావిడ భాష సామ్యము గ్రంథాలను రచించారు. ఆయన సాహితీ విమర్శకునిగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 

 


 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జననం : భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భారతదేశ ఏడవ  ప్రధానమంత్రి అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్  1931 జూన్ 25వ తేదీన జన్మించారు. భారతదేశం యొక్క ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేశారు. మండల కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారి  కొరకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది ఈయనే.  1969లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1971లో లోక్సభకు ఎన్నికయ్యారు ప్రతాప్ సింగ్. దొంగతనాలు అదుపు చేసే క్రమంలో వ్యక్తిగత వైఫల్యం పొందినందుకు గాను రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా పేరు పొందారు ఈయన. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. 

 


 శారదా జననం : తెలుగు మలయాళ సినీ నటి అయిన శారద 1945 జూన్ 25వ తేదీన జన్మించారు. ముఖ్యంగా నటి శారద తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితులే. అయితే శారద అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును సైతం అందుకుని  శారద ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మారిన శారద ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకుంది శారద. ఇక శారద హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైంది శారదా. 

 

 మైకేల్ జాక్సన్ మరణం : అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు అయిన మైకేల్ జాక్సన్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితుడు. ప్రపంచవ్యాప్తంగా మైకేల్ జాక్సన్ డాన్స్ కి సంగీతానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం థ్రిల్లర్ జాక్సన్ పాడినదే .10 సంవత్సరాల వయసు నుంచే పాడటం  ప్రారంభించిన మైకేల్ జాక్సన్ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక మైకల్ జాక్సన్ 2009 జూన్ 25వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: