
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 29 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు:
1900: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)
1903: లెస్లీ టౌన్స్ "బాబ్" హోప్, బ్రిటిష్-అమెరికన్ స్టాండ్-అప్ కమెడియన్, నటుడు, గాయకుడు, అథ్లెట్, రచయిత. (మ.2003)
1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
1917: జాన్.ఎఫ్.కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
1920: జాన్ హర్సాని, హంగేరియన్-అమెరికన్ ఆర్థికవేత్త, విద్యావేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 2000)
1925: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
1929: పీటర్ హిగ్స్, ఇంగ్లీష్-స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు.
1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
1954: పంకజ్ కపూర్ హిందీ థియేటర్, టెలివిజన్, సినిమా నటుడు. అతని మొదటి భార్య నీలిమా అజీమ్. అతను బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి తండ్రి.
1965: కంచర్ల సుబ్బానాయుడు, పాత్రికేయుడు, రచయిత, సంపాదకుడు, సేవ తెలుగు పత్రిక, ఆంధ్రప్రదేశ్.
1980: ఉష, తెలుగు నేపథ్య గాయని.
1984: నాయా జాక్స్, ఆస్ట్రేలియన్-అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్
1992: ప్రీతికా రావు భారతీయ నటి, మోడల్, మాజీ సినీ జర్నలిస్ట్, గాయని.
ప్రముఖుల మరణాలు:
1829: హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
1993: బిల్లీ కాన్, అమెరికన్ బాక్సర్ (జ .1917)
1928: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (జ.1857)
1964: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
1972: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
1975: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)
1987: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911)
1987: చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (జ.1902)
1994: అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత.
1996: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)
2018: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
ముఖ్య సంఘటనలు:
1798: యునైటెడ్ ఐరిష్మెన్ తిరుగుబాటు: ఐర్లాండ్ లోని కౌంటీ కిల్డేర్ లో 300-500 మధ్య కాలంలో యునైటెడ్ ఐరిష్ ప్రజలను బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారులుగా అని భావించి ఉరితీసింది.
1919: ఆర్థర్ ఎడింగ్టన్, ఆండ్రూ క్లాడ్ డి లా చెరోయిస్ క్రోమెలిన్ చేత ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతం పరీక్షించబడింది. తరువాత ధృవీకరించబడింది.
1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.
1997: స్పెయిన్ లోని శాస్త్రవేత్తలు 780,000 సంవత్సరాల పురాతన శిలాజంలో ఒక కొత్త జాతి మానవ జాతి ఉన్నట్లు ఒక ప్రకటన చేశారు.
పండుగలు, జాతీయ దినాలు:
మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.
ప్రపంచ జీర్ణ ఆరోగ్యం దినం.