టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని పేరు తెచ్చుకున్న సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.మేం విడిపోతున్నాం..కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో వీరిద్దరి విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో అక్కినేని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.ఇక సమంత తన విడాకుల విషయం నుండి బయటపడటానికి వరుస సినిమాలను సైన్ చేస్తూ..బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుటుందట.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఈ షోలో సామాన్యులతో పాటూ సెలెబ్రిటీలు కూడా పాల్గొంటూ అందరిని హుషారెత్తిస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,అగ్ర దర్శకులు  కొరటాల శివ, రాజమౌళి  ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోలో సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ఓ ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దసరా కానుకగా ఈ ఎపిసోడ్ ని జెమినీ టీవీ వారు టెలికాస్ట్ చేయనున్నారు.

మరో వైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా లీక్ అవుతున్న మ్యాటర్ ను బట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా రానుందట.చూడాలి మరి ఈ షోలో అయిన తను విడాకులు ఎందుకు తీసుకుందో అనే విషయం పై క్లారిటీ ఇస్తుందేమో.ఇక సమంత..ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామ్ లీడ్ రోల్ లో నటిస్తోంది.ఇక ఈ సినిమాతో పాటూ తమిళంలో ఒక సినిమాకి సైన్ చేసింది.ఇక ప్రస్తుతం ఓ యాడ్ షూట్లో కూడా సమంత నటిస్తున్నట్లుగా సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: