సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర చేసే సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట అను. ఈ చిత్రంలో అనసూయ పల్లెటూరి పాత్రలో కనిపించాల్సి వచ్చింది, స్లాంగ్ , వేషధారణ అంతా తన ఒరిజినల్ లైఫ్ కు భిన్నం అయితే సినిమాలో ఆ పాత్రను అవలీలగా రక్తి కట్టించిన అనసూయ మొదట్లో ఆ పాత్ర కోసమే చాలా రీసెర్చ్ చేశారట. బాగా వర్క్ ఔట్ చేశారట...పల్లెటూరి బాష, హావభావాలు ఇక ప్రతి చిన్న పాయింట్ గురించి తెలుసుకున్నారట. ఇలా చాలా వర్క్ అవుట్ చేసినట్లు తెలిసింది.
అయితే చాలా వరకు సింగిల్ టేక్ లోనే నటించి అందరినీ ఆశ్చర్య పరిచారట అనసూయ. ఇక రంగస్థలం మూవీ విడుదలయ్యాక సినిమా ఎంత సంచలన విజయం అందుకుందో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్రకు కూడా అంతే విశేష ఆదరణ లభించింది. ఆ తరువాత సినిమాల్లో బాగా బిజీ అయిపోయారు అను. మొన్న ఈమె నటించిన పుష్ప కూడా హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.