దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ దర్శకుడు ఎన్నో హిట్, సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ సినిమా లతో ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు,   ప్రస్తుత కాలంలో మాత్రం ఆరెంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో కాస్త స్లో అయ్యాడు అని చెప్పవచ్చు. అయితే అలా వరుస అపజయలతో డీలా పడిపోయిన మణిరత్నం మరోసారి అదిరిపోయే సూపర్ హిట్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి రావాలని ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు,  ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 ఇలా ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ , కార్తి , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ మూవీ కి ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు, పొన్నియిన్ సెల్వన్ చోళరాజుల కాలానికి సంబంధించిన కథ , ఆ కాలం లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన, దాని చుట్టూ అల్లుకున్న కథే ఈ పొన్నియిన్ సెల్వన్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాల కలిగి ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది,  ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీ న  విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా తెలియజేసింది, ఇలా దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్న పొన్నియిన్ సెల్వన్ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం తాజా గా తెలుజేజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: