ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు కేటాయించిన ఎన్టీఆర్ ఆ మధ్యకాలంలో మరో సినిమాను ఆయన చేయలేదు. అయితే ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఈ సినిమా ఎంతకీ మొదలుకాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే మరొకవైపు రాంచరణ్ ఏమో.. ఆచార్య సినిమాని పూర్తి చేసి ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ని కూడా లైన్లో పెట్టి తన 15వ చిత్రాన్ని చకచక తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అయితే  కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టకపోవడం పై ఆయన అభిమానులు దర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే ఆచార్య సినిమాకు సంబంధించిన సెటిల్మెంట్ గొడవల్లో కొరటాల శివ చిక్కుకోవడంతో తాజా సినిమా ఆలస్యానికి కారణం అవుతోంది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే కొరటాలతోనే ఎన్టీఆర్ కొత్త చిత్రం మొదలు పెడతారా లేక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తో కొత్త సినిమా మొదలు పెడతారా అనే విషయంపై పలు రకాల వార్తలు వెలువడుతున్నాయి.పోతే ప్రేక్షకులు అయోమయంలో ఉన్న నేపథ్యంలో నందమూరి అభిమానులకు కొత్త చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వడానికి అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చారు .

కాగా  ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది .ఇకపోతే  ప్రపంచ స్థాయికి చేరుకుందని… అలాంటి సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేస్తే బాగుంటుందనే విషయంలో ఎన్టీఆర్ చాలా ఆలోచిస్తున్నారని కళ్యాణ్ రామ్ తెలిపారు.అయితే నిర్మాతగా తమ మీద చాలా బాధ్యత ఉంటుందని, ఇక ఆ బాధ్యతనుంచే జాగ్రత్త , భయం పుడతాయని కళ్యాణ్ రామ్ తెలిపాడు. అంతేకాదు ముఖ్యంగా అభిమానులు ఆత్రుతగా ఉన్నారని అర్థం చేసుకోగలము.. కానీ ఏ అప్డేట్ వచ్చినా సరే చాలా పవర్ ఫుల్ గా ఉండాలని..ఇక  అందరికీ నచ్చేలా ఉండాలని తమ భావిస్తున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించారు. పోతే బింబిసారా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వస్తున్నాడు.ఇక  అతడిని చూడడానికి , తన ప్రసంగం వినడానికి అభిమానులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఅంతేకాదు  జూలై 29వ తేదీన ఆరోజు ఫోకస్ మొత్తం తన మీదే ఉండాలని ఉద్దేశంతోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ను ముందే ఈ రోజు రిలీజ్ చేశాము అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: