రూ.200 కోట్ల స్కాంలో జైలు పాలైన ప్రముఖ బిజినెస్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖరన్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది. ఢిల్లీలో పాటియాలా కోర్టు ఆమె షరతులతో కూడిన భైరను కూడా మంజూరు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 10వ తేదీన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు వేలు పై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తెలియజేయడం జరిగింది ఇక ఈ రోజున రూ.2 లక్షల పూచికత్తు మీద ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.



ఇప్పటికే ఈ కేసు పై పలుచార్జి సీట్లు దాఖలైన నేపథ్యంలో ఈమెను కస్టడీలో ఉండవలసిన అవసరం లేదని న్యాయస్థానం తెలియజేసింది అయితే అనుమతి లేకుండా మాత్రం ఎక్కడికి వెళ్లకూడదని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను కోర్ట్ ఆదేశం జారీ చేసింది. సుకేష్ చంద్రశేఖర్ పలువురిని మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించారని.. అతనిపై ఆరోపణలు రావడంతో అతనిని అరెస్టు చేసి ఈడి అధికారులు విచారణ జరిపించారు. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతనితో డేటింగ్ చేస్తోందని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి చాలా దగ్గరగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈడీ అధికారులు ఈమెను కూడా విచారించినట్లుగా సమాచారం.


అయితే ఈడి అధికారులు తెలిపిన ప్రకారం..జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కుటుంబం కోసం సుఖేష్ చంద్రశేఖర్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని ఈడి అధికారులు తెలియజేశారు.జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేశ్ చంద్రశేఖర్ మధ్య ఉన్న సంబంధాలు కారణంగానే ఈమెను మీడియా అధికారులు ప్రశ్నించినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసులు జాతి మభ్యంతర బెల్ తీసుకుంది అనంతరం ఈ కేస్ రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బెయిల్ ను ఈడీ అధికారులు వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు మాత్రం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: