రాజశేఖర్ కారుకు హైదరాబాద్ అప్పా సెంటర్ దగ్గర ప్రమాదం జరిగిన తరువాత రకరకాల వార్తలు వచ్చిన తరువాత మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చిన సందర్భంలో ఆవేశపూరితంగా రాజశేఖర్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. దేవుడు దయవల్ల తాను బ్రతికి బయటపడ్డాను అని చెపుతూ టాలీవుడ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఒక దారుణమైన కల్చర్ తనను బాధించింది అంటూ కామెంట్స్ చేసాడు.

ఇండస్ట్రీలోని ఒక వ్యక్తి చచ్చిపోయినా మనుషులు పట్టించుకోవడం లేదనీ ఇండస్ట్రీలోని చాలామంది వ్యక్తులు సంస్కార రహితంగా మారిపోతున్నారని రాజశేఖర్ తీవ్ర ఆవేదనను వ్యక్త పరిచాడు. దీనితో రాజశేఖర్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజశేఖర్ దురుసుతనం వల్ల జరిగిన యాక్సిడెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎలా సంఘీభావం తెలుపుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాదు రాజశేఖర్ కు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం ఇదే మొదటిసారి కాదనీ అలాంటి పరిస్థుతులలో రాజశేఖర్ వ్యక్తిగత దురుసుతనానికి ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ ఇస్తుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు ప్రస్తుతం రాజశేఖర్ అవకాశాలు లేక బాథపడుతున్న పరిస్థితులలో ఇలాంటి దూకుడు స్వభావంతో కూడిన వివాదాస్పద కామెంట్స్ చేయడం అతడి కెరియర్ కు ఏమాత్రం మంచిదికాదు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ ప్రమాదం పై లోతైన విచారణ జరుపుతున్న అధికారులు రాజశేఖర్ తీరు భవిష్యత్ లో మారకుంటే అతడి లైసెన్స్ రద్దు చేయడం ఒక్కటే మార్గం అన్నఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇలా వివాదాస్పదంగా వ్యవహరించే తీరు వల్లనే ‘మా’ సంస్థలో కూడ రాజశేఖర్ అనేక మందికి శత్రువుగా మారాడు అన్నకామెంట్స్ ఉన్నాయి. ఒక వైపు విలన్ పాత్రలు ఇచ్చినా సినిమాలలో చేస్తాను అని చెపుతున్న రాజశేఖర్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఆవేశంతో చేసి చాలామందికి దూరం అవుతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: