స్టైలీష్ డైరెక్టర్ సురేష్ రెడ్డితో సినిమాకు వరుణ్ తేజ్ నో చెప్పాడా..? రామ్ చరణ్ తో క్లాషెస్ వల్లే మెగా ప్రిన్స్, స్టైలీష్ డైరక్టర్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడా.. మెగా వారసుడు చెర్రీతో దర్శకుడు సూరీ గొడవేంటి. సైరా లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత స్టైలీష్ డైరెక్టర్ కు ఛాన్స్ లు రాకపోవడానికి రీజన్ ఏంటి..?


సైరా నరసింహా రెడ్డి సినిమాతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తర్వాత లెవల్ కు వెళ్తాడనుకున్నారు. కానీ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కాకపోవడంతో స్టైలీష్ డైరెక్టర్ కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. మేకింగ్ పరంగా డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి తన విజన్ చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో ఆడకపోవడం మైనస్ గా మారింది. ఈ విషయమే ఇప్పుడు సురేందర్ రెడ్డి అవకాశాలకు గండి కొట్టుకుపోతోంది. 

 

సైరా తర్వాత సురేందర్ రెడ్డి అదే రేంజ్ లో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక కన్ఫర్మేషన్ ఏదీ లేదు. ప్రభాస్ తో సినిమా చేయాలని భావించినా మరో రెండేళ్ల వరకు డార్లింగ్ డేట్స్ కష్టమే. ీ క్రమంలో మెగా కాంపౌండ్ హీరోతోనే సూరి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేసినా అది కూడా వర్కవుట్ కాలేదని వినిపిస్తోంది.

 

వరుణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేశాడట. కానీ ఇందుకు మెగా ప్రిన్స్ నో చెప్పాడని ప్రచారమవుతోంది. సైరా పారితోషికం విషయంలో నిర్మాత రామ్ చరణ్ తో సూరి ఘర్షణ పడ్డాడని. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ తో సూరి డీల్ క్యాన్సిల్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ మాత్రం సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ మంచి స్నేహితులని వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని కొట్టి పారేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అని త్వరలోనే తెలిసిపోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: