శోభితా దూళిపాళ్ల.. 'మిస్ ఇండియా ఎర్త్' కిరీటం గెలిచిన ఓ అచ్చమైన తెలుగమ్మాయి. తెనాలిలో పుట్టి వైజాగ్‌ లో పెరిగిన శోభిత సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ రమణ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘రామన్ రాఘవ్ 2.0’ అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శోభిత దూళిపాళ్ల 'గూఢచారి' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమానే సక్సెస్ కావడంతో నటిగా ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. 'మూతన్' 'ది బాడీ' 'చెఫ్' అనే చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన హీరో అడివి శేషు ప్రస్తుతం ‘మేజర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల కూడా ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తోన్నారు. ఇటీవల ఆమె ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.

'లాక్‌డౌన్‌ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్‌ చేసుకున్నాను. నాకు నేనే మేకప్‌ వేసుకుని.. సెల్ఫ్‌ టైమర్‌ తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నాను' అని శోభితా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోషూట్‌ ఫొటోలు బయటకు రావడంతో.. అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ‘శోభితా అబద్ధం చెప్పింది. సెల్ఫ్‌ టైమర్‌ పెట్టి ఫొటోషూట్‌ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్‌ ఏం చేస్తున్నాడు. అందరూ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తుంటే శోభితా మాత్రం కెమెరా మ్యాన్ ని పెట్టుకొని ఫోటో షూట్లు చేస్తోంది. బాధ్య‌త‌గ‌ల సెల‌బ్రిటీలుగా వుంటూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిల‌వాల్సింది పోయి ఇలా చేస్తోంది’ అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టారు. 

మ‌న‌స్తాపానికి గురైన శోభిత అస‌లు ఫొటో షూట్ ఎలా ఇరిగింది.. త‌ను సెల్ఫ్ టైమ‌ర్‌ తో ఫొటోల‌కు ఎలా పోలిజిచ్చింది అనే వాటిని ఒక పెద్ద లెటర్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. 'నెటిజన్ల ట్రోలింగ్‌ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను. నా ఫొటో షూట్‌ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నాను. త‌ను టెర్రాస్ పై సెల్ఫీ టైమ‌ర్ కెమెరాతో ఫొటోలు తీసుకుంటుండ‌గా పైకి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌ను తీసిపెడ‌తాన‌ని చెప్పి ఫొటోలు తీశారు. ఆ త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అయితే అత‌ను తీసిని ఏ ఫొటోనీ తాను మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం పంపించ‌లేద‌ని, తాను స్వ‌యంగా తీసుకున్న ఫొటోనే పంపించాన‌ని' చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: