1990, 2000 సంవత్సరాల్లో ఇండియన్‌ స్క్రీన్‌ మీద తిరుగులేని హాట్ జోడిగా పేరు తెచ్చుకున్న జంట షారూఖ్‌ ఖాన్, కాజోల్‌. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే కలిసి నటించిన ఈ జంట ఇండియన్‌ స్క్రీన్ మీద బెస్ట్ ఆన్‌ స్క్రీన్ జోడిగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు ఇండియన్‌ స్క్రీన్ మీద అతి ఎక్కువ కాలం ప్రదర్శితమైన సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఈ సినిమా తరువాత కరోణ్‌ జోహర్ కుచ్ కుచ్‌ హోతా హై, కబీ కుషీ కబీ గమ్‌ సినిమాల్లోనూ మెస్మరైజ్‌ చేసింది ఈ జోడి.

 

తొలిసారిగా 1993లో రిలీజ్ అయిన బాజీగర్‌ సినిమాలో తొలిసారిగా కలిసి నటించాడు షారూఖ్‌, కాజోల్‌. ఆ తరువాత రెండేళ్లకు డీడీఎల్‌జే సినిమాతో రొమాంటిక్‌ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు ఈ హాట్ కపుల్‌. ఈ సినిమా బాలీవుడ్‌ హిస్టరీలోనే అత్యదిక ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు ఏకంగా 10 ఫిలిం ఫేర్ అవార్డులు రావటం విశేషం. ముంబైలోని మరాఠా మందిర్‌లో ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది.

 

ఇతర చిత్రాల్లోనూ ఈ జోడి అదే స్థాయిలో మెస్మరైజ్‌ చేసింది. కుచ్‌ కుచ్‌ హోతా హై సినిమాకు 8 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కగా, కబీ ఖుషీ కబీ గమ్ సినిమాకు 5 ఫిలిం ఫేర్‌లు వచ్చాయి. ఈ సినిమాల తరువాత మరోసారి ఈ జంట కలిసి నటించడానికి చాలా సమయం పట్టింది. కాజోల్ పెళ్లి తరువాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వటంతో షారూఖ్, కాజోల్‌ జోడి తిరిగి తెర మీద కనిపించలేదు. అయితే 2010లో ఈ సూపర్‌ హిట్ జోడి మరోసారి తెర మీదకు వచ్చింది.

 

సందేశాత్మకంగా తెరకెక్కిన మై నేమ్ ఈజ్‌ ఖాన్ సినిమాలో ఈ జంట కలిసి నటించారు. తరువాత 2015లో రిలీజ్ అయిన దిల్ వాలే సినిమాలోనూ ఈ సూపర్‌ హిట్ కపుల్‌ కనువిందు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: