కంగనా రనౌత్ ఎలాంటి సిట్యుయేషన్ ను అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎంతపెద్ద గొడవైనా సరే ఫుల్ గా వాడేసుకుంటుంది. ఇప్పుడీ లాక్ డౌన్ ని కూడా ఇలాగే ఉపయోగించుకుంటోంది కంగనా రనౌత్. జనాలంతా దీని నుంచి ఎప్పుడు బయటపడతామా.. అని ఎదురు చూస్తుంటే.. కంగన మాత్రం ఈ లాక్ డౌన్ ని వాడుకోవడానికి చెమటలు చిందిస్తోంది. 

 

లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోయి.. ఇండస్ట్రీ ఇంటికే పరిమితమైంది. ప్రమోషన్లు, పబ్లిసిటీ ఈవెంట్లు, అభిమానులతో ఇంటరాక్షన్లు లేక స్టార్లు విసుగెత్తిపోతున్నారు. కానీ కంగన రనౌత్ ఈ లాక్ డౌన్ ను కూడా ఫుల్ గా వాడుకుంటోంది. ఈ క్వారంటైన్ పీరియడ్ ను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గా మార్చుకుంటోంది కంగనా రనౌత్. 

 

కంగనా రనౌత్ తలైవి సినిమా కోసం 20కేజీల బరువు పెరిగింది. జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బొద్దుగా కనిపించేందుకు చాలా వెయిట్ గెయిన్ చేసింది. అయితే ఇప్పుడు అనుకోకుండా షూటింగ్ లకు బ్రేక్ రావడంతో.. ఈ టైమ్ మొత్తాన్ని వెయిట్ లాస్ కే కేటాయిస్తోంది కంగన. 

 

కంగనా రనౌత్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తో పాటు రెగ్యులర్ వివాదాస్పద కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది కంగన. ఒక షిఫ్ట్ వర్కవుట్లు, మరో షిఫ్ట్ వివాదాలు అనే విధంగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది. ఈమె చెల్లెలు రంగోలి చందల్ విద్వేషాలు రెచ్చగొడుతోందని.. ట్విట్టర్ నిర్వాహకులు  ఆమె అకౌంట్ ను బ్లాక్ చేసినపుడు పెద్ద గోలచేసింది. బాలీవుడ్ సెలెబ్రటీస్ ఆమెపై పగబట్టారని కామెంట్స్ పెట్టింది. మొత్తానికి కంగనా రనౌత్ లాక్ డౌన్ టైమ్ లో యమా బిజీగా గడుపుతోంది. చెమటలు చిందిస్తూ కుర్రకారుకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. తలైవి కోసం 20కేజీలు పెరిగిన ఈ బ్యూటీ వెయిట్ లాస్ కోసం తెగ కష్టపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: