సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు విడుదలై ‘సర్కారు వారి పాట’ మూవీ టైటిల్ లుక్ పోస్టర్ కు పోష్టర్ కు అనూహ్య స్పందన రావడంతో దర్శకుడు పరుశు రామ్ మంచి జోష్ మీద ఉంటూ ఈ సినిమాకు సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక విషయమై దృష్టి పెట్టాడు. పరశు రామ్ మహేష్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.


అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని వచ్చే ఆగష్టు నుండి మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదలచేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా కథ ఒక టాప్ హీరో గతంలో నటించిన సినిమా ఛాయలలో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం మొదలైంది. ఈ సినిమా కథ బ్యాంకు ఫ్రాడ్స్ చుట్టూ ఆర్థికనేరాల నేపధ్యంలోఉంటుంది అన్నవార్తలు ఇప్పటికే వచ్చాయి.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో మహేష్ బ్యాంకు ఉన్నత  అధికారి అయిన తన తండ్రి పై పడ్డ నిందలను చెరిపేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఉంటుంది అని టాక్. తన తండ్రి పై పడ్డ నిందలు చెరిపివేయడానికి మహేష్ ఈమూవీలోని మెయిన్ విలన్ తో ఆడే మైండ్ గేమ్ చూసిన వారికి గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని మైండ్ గేమ్ సీన్స్ గుర్తుకు వస్తాయి అని అంటున్నారు.


ఇప్పటికే ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన పరుశు రామ్ ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో కూడ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో ‘సర్కారు వారి పాట' లో మహేష్ సరసన కియారా అద్వానీ నటించనుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక మందన పేరు కూడా వినిపించింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్ బాబు‌ సరసన దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌ ని ఫైనల్ చేశారనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన విడుదల చేస్తారని టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: