మహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న మళయాళ భామ కీర్తి సురేష్ లీడ్ రోల్ లో కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వ నిర్వహణ, నిర్మాణంలో తెరకెక్కిన సినిమా పెంగ్విన్. ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు ఓటిటిలో రిలీజైంది. అంతా యువ టాలెంట్ పీపుల్ కలిసి చేసిన ఈ సినిమాకు మిక్సెడ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమా చేయడానికి గల కారణాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకొచ్చారు కీర్తి సురేష్.

 

సినిమా కథ చెప్పగానే నచ్చింది. తను ఇదివరకు ఎప్పుడు చేయని పాత్ర అందుకే సినిమా చేయాలని అనిపించింది. దర్శకుడు నాలుగు గంటల ఫుల్ నరేషన్ ఇచ్చాక.. సినిమా మిస్సవ్వకూడదని అనిపించింది. ఈ సినిమా కేవలం 35 రోజుల్లో పూర్తి చేయడం విశేషం. అనుకున్న విధంగా షెడ్యూల్ వేసుకోవడం.. అనుకున్న టైం కు సినిమా తీయడం అంటే అది మాములు విషయం కాదు. అందుకే సినిమా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేశారు.

 

అయితే సినిమా మొదటి భాగం వరకు బాగున్నా సెకండ్ హాఫ్ మీద మరింత వర్క్ చేస్తే బాగుండేది అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే సస్పెన్స్ మెయింటైన్ చేయకపోగా సాగదీసినట్టుగా సినిమా ఉండటం కూడా పెంగ్విన్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. మంచి ప్రయత్నమే చేశారు కాని స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేదని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ పర్ఫెక్ట్ అని.. థియేటర్ లో రిలీజ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదని కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ఎలాగు ఓటిటి రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానం పొందే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: